ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ షాక్ రిప్లై! యుద్ధం ముగింపు మా చేతుల్లోనే ⚠️

ఇరాన్లో యుద్ధాన్ని ముగించడం గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అమెరికా కాదు, తామే నిర్ణయిస్తామని ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) తెలిపింది. అమెరికా- ఇజ్రాయెల్ లక్ష్యాలపై సైనిక చర్యలు ఎప్పుడు ఆగిపోయాయో నిర్ణయించేది. ఇరాన్నే అన్నారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఈ ప్రాంతం సమీకరణాలు, భవిష్యత్తు ఇప్పుడు ఇరాన్ దళాల చేతుల్లో ఉందని చెప్పింది.

“ఇరాన్ భారీ నిర్ణయం! కొత్త సుప్రీమ్ లీడర్ ఎవరు? ప్రపంచం టెన్షన్‌లో 😱”

ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీమ్ లీడర్ ఎంపికపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం, అయితే పేరు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్‌పై కనీసం ఆరు నెలలు తీవ్రమైన యుద్ధాన్ని కొనసాగించగలమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు.

ఇక గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినట్లు సమాచారం. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని డిప్లొమాటిక్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన డ్రోన్‌ను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకులను కూడా డ్రోన్లు టార్గెట్ చేశాయని చెబుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం మినాబ్‌లోని ఒక పాఠశాలపై జరిగిన ఘోర దాడికి ఇరాన్‌నే బాధ్యుడిగా ఆరోపించారు. ఆ దాడిలో కనీసం 150 మంది మృతి చెందినట్లు సమాచారం.

“ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్య! అమెరికా సైన్యానికి 15/10 రేటింగ్ 😱”

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా సైన్యం పనితీరుకు అసాధారణ రేటింగ్ ఇచ్చారు. అమెరికా ఇప్పుడు కమాండింగ్ స్థానంలో ఉందన్నారు. యుద్ధ రంగంలో అమెరికా సైన్యం పైచేయి సాధించిందని, బాగా పనిచేసిందని చెప్పారు. ఇందులో భాగంగా ట్రంప్ 15/10 రేటింగ్ ఇచ్చారు.

“ఇజ్రాయెల్ భారీ దాడి! ఖమెనీ మృతి వార్తలు… ఇరాన్ నాయకత్వం షాక్‌లో! 🚨”

ఇరాన్ ముఖ్య నాయకుడు అయతొల్లా అలీ ఖమెనీ US-ఇజ్రాయెల్ దాడులలో మరణించినట్టు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. 

అలాగే, కొత్తగా నియమితులైన రక్షణ మంత్రి కూడా దాడిలో మృతి చెందినట్లు కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి.

ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రక్షణ మంత్రి Amir Nasirzadeh మరియు సైన్యాధ్యక్షుడు మరణించినట్లు సమాచారం.

దీంతో యుద్ధం మరింత తీవ్రమైంది. ఇజ్రాయెల్ మరియు అమెరికా ఇరాన్ గగనతలంపై నియంత్రణ ఉందని చెబుతున్నాయి.

ఇరాన్‌లో కొత్త నాయకుడు వచ్చినా అతను కూడా లక్ష్యంగా మారవచ్చని ఇజ్రాయెల్ హెచ్చరించింది.